ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 16, 2019, 10:13 AM IST

ETV Bharat / state

'బడుగు బలహీన వర్గాలకు వైకాపానే అండ'

వచ్చే ఏడాది నుంచి పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రారంభిస్తున్నారని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో సెమి క్రిస్మస్ వేడుకల్లో మంత్రి సురేష్‌తో పాటు తానేటి వనిత పాల్గొన్నారు.

semi Christmas celebrations at Yarragondapalem in Prakasam district
క్రిస్మస్ స్టార్ ను ఆవిష్కరిస్తున్న మంత్రులు

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో నియోజకవర్గ పాస్టర్స్ ఆధ్వర్యంలో సెమి క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు తానేటి వనిత, ఆదిమూలపు సురేష్‌ పాల్గొన్నారు. ఈ వేడుకల్లో చిన్నారుల నృత్యాలు, శాంటాక్లాజ్ అలరించాయి. మంత్రులు క్రిస్మస్ స్టార్‌ను ఆవిష్కరించి... ఆకాశ దీపాలు వెలిగించారు. అనంతరం కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి ఆదిములపు సురేష్ మాట్లాడుతూ...ఎల్లప్పుడూ వైకాపా ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు అండగా నిలుస్తుందన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల వారికి సమానమైన అవకాశాలు కల్పించడానికి ముఖ్యమంత్రి కృషిచేస్తున్నారని తెలిపారు. వచ్చే ఏడాది నుంచి అన్ని పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు.

ఎల్లప్పుడూ వైకాపా ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు అండగా నిలుస్తుంది

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details