ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 30, 2021, 8:10 PM IST

ETV Bharat / state

పోలింగ్​ బూత్​లను పరిశీలించిన ఎస్పీ సిద్ధార్థ కౌశల్

ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేసిన పలు పోలింగ్ బూత్​లను పోలీసు అధికారులు పరిశీలించారు. ఎవరైనా నిబంధనల అతిక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

police in prakasam district
ప్రకాశం జిల్లాలో పోలింగ్​ బూతుల పరిశీలిస్తున్న పోలీసులు

ఎన్నికల సమయంలో నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ సిద్ధార్థ కౌశల్ స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం ఏడుగుండ్లపాడు గ్రామంలో పోలింగ్ కేంద్రాన్ని ఎస్పీ పరిశీలించారు. మండలాల్లో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలని.. ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకుంటే వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

ముందుగా ఏడుగుండ్లపాడు, ఉప్పుగుండూరు, నాగులుప్పలపాడు గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించి అధికారులతో మాట్లాడారు. నియోజకవర్గంలో సర్పంచి​ అభ్యర్థులుగా పోటీ చేసేందుకు మొత్తం 22 మంది నామినేషన్లు దాఖలు చేశారు.

ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం రామన్నపేట పంచాయతీకి ఈనెల 9న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో... చీరాల డీఎస్పీ పీ.శ్రీకాంత్ పోలింగ్ బూత్​లను పరిశీలించారు. రామన్నపేట పంచాయతీలో ఉన్న 14 వార్డులకు..14 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. డీఎస్పీ వీటిని పరిశీలించి సిబ్బందికి పలు సూచనలిచ్చారు. రెండోరోజు అభ్యర్థుల నుంచి నామపత్రాలను అధికారులు స్వీకరించారు.

ఇదీ చదవండి:

కోడ్ కూసినా... ముసుగు పడలేదు!

ABOUT THE AUTHOR

...view details