ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 5, 2020, 9:35 AM IST

ETV Bharat / state

మార్టూరు ఎస్​ఐ చొరవతో ప్రయాణికులకు వైద్య పరీక్షలు

ప్రకాశం జిల్లా మార్టూరు ఎస్.ఐ శివకుమార్ ప్రయాణికులకు కరోనాపై అవగాహన కల్పించడంతోపాటుగా వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. 16వ నెంబర్​ జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న వారికి వైద్య పరీక్షలు చేసి.. వారికి ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఆహారం పంపిణీ చేస్తున్నారు.

Health checks for  travelers on the highway
ప్రయాణికులకు వైద్య పరీక్షలు

ప్రకాశం, గుంటూరు జిల్లాల సరిహద్దుల్లో డేగరమూడి వద్ద పోలీసులు చెక్ పోస్టు ఏర్పాటు చేశారు. జిల్లాలోకి ప్రవేసిస్తున్న వాహనదారులకు ప్రకాశం జిల్లా మార్టూరు ఎస్.ఐ శివకుమార్ వైద్య సిబ్బందితో పరీక్షలు చేయించి మరీ పంపిస్తున్నారు. మొత్తం 42 మందిని ద్రోణాదుల మెడికల్ ఆఫీసర్ తో జలుబు దగ్గు, శ్వాసకోశ పరీక్షలు చేయించి, అల్పాహారం అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details