ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 27, 2020, 9:10 PM IST

ETV Bharat / state

నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు

ప్రకాశం జిల్లా బల్లి కురవ మండలం గుంటుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంపై వచ్చిన ఆరోపణలపై డీఎంహెచ్​వో ఆసుపత్రిని తనిఖీ చేశారు. వైద్యశాల మధ్యాహ్నానికే మూసివేయడంపై అధికారులను నిలదీశారు. నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని సిబ్బందిని హెచ్చరించారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు

ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం గుంటుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బందిపై వచ్చిన ఆరోపణపై డీఎంహెచ్​వో విచారణ చేపట్టారు. ఆసుపత్రిని పరిశీలించారు. 24 గంటలు సేవలు అందించవలసిన వైద్యశాల మధ్యాహ్నానికి మూసివేయటంపై సిబ్బందిని నిలదీశారు. ప్రభుత్వ వైద్యులుగా పనిచేస్తున్న సిబ్బంది వేరేచోట ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టకూడదన్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details