ప్రకాశం జిల్లా, రాచర్ల మండలం పుల్లలచెరువు గ్రామంలోని రంగనాయకస్వామి ఆలయ ఆవరణలో గల రంగస్వామిగుండానికి.. పెద్దఎత్తున భక్తులు తరలుతున్నారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి వరద పెరిగి కొండల మీద నుంచి జాలువారుతోంది. ఈ జలధార దృశ్యం చూపరులను ఆకట్టుకుంటోంది. అంతేగాక ఆరు నెలలుగా వర్షం లేక ఇబ్బందిపడుతున్న అన్నదాతలకు ఈ వర్షం రాక ఉపశమనం ఇచ్చింది.
వర్షంతో రంగస్వామి గుండం జలపాతం పరవళ్లు
ప్రకాశం జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు.. రంగస్వామిగుండం జలకళను సంతరించుకుంది. అక్కడి జలధారను చూడటానికి పర్యాటకులు తరలివెళ్తున్నారు.
devoties want to see waterflow of rangaswamy gundam at prakasham district