ప్రకాశం జిల్లాలో ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసులు 15కు చేరాయి. క్రమంగా పెరుగుతున్న పరిస్థితుల్లో యంత్రాంగం సైతం అదే రీతిలో అప్రమత్తమైంది. వ్యాప్తిని అరికట్టేందుకు మరిన్ని చర్యలు చేపట్టింది. మూడు దశల్లో యుద్ధ ప్రాతిపదికన చర్యలు అమలుచేస్తోంది.
ప్రస్తుతం జీజీహెచ్ ఐసోలేషన్లో కరోనా అనుమానితులను చేర్చారు. అక్కడ పడకలు సరిపోక కొందరిని స్పెషల్ రూముల్లో, మరికొందరిని వైద్య విద్యార్థుల క్వార్టర్స్లో చేర్చారు. కేసులు గత నెలలో విదేశాల నుంచి జిల్లాకు వచ్చిన వారికి క్వారంటైన్ సమయం పూర్తి కావచ్చినా, వారిని మరో 14 రోజుల వరకు బయట తిరగనీయకుండా ఇంటికే పరిమితం చేయాలని అధికారులు తాజాగా నిర్ణయించారు.
కందుకూరులోనూ నమూనాలు..
వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అనుమానితుల నుంచి అత్యధికంగా నమూనాలు సేకరించి పరీక్షకు పంపారు. మంగళవారం ఉదయం నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు వైద్యులు నమూనాలు సేకరించే పనిలోనే ఉన్నారు. గతంలో ఒంగోలు, చీరాల, మార్కాపురంలో నమూనాలు సేకరించగా, బుధవారం నుంచి కందుకూరులోని ఐసోలేషన్ వార్డులోనూ తీయడం ప్రారంభించారు. తొలిరోజు అక్కడ 50 మంది నమూనాలు తీశారు. బుధవారం ఒంగోలు జీజీహెచ్లో 20, చీరాల, మార్కాపురంలో కలిపి 60 నమూనాలు తీశారు.
మూడు ల్యాబ్లకు..