ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ ప్రకాశం జిల్లా ఒంగోలులో ఏఎన్ఎంలు కలెక్టరేట్ ముట్టడి చేపట్టారు. గ్రామ సచివాలయంలో తమను ఉద్యోగులుగా తీసుకొన్న తర్వాతే మిగిలిన ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. పాదయాత్ర సమయంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని కోరారు. సుప్రీ కోర్టు ఆదేశాల మేరకు సమాన వేతనం చట్టాన్ని అమలు చేయాలని నిరసన చేపట్టారు. 20 సంవత్సరాలకు పైగా ఏఎన్ఎంలుగా ఉన్న తమను ఇప్పుటికిప్పుడు తీసిస్తే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.
ఉద్యోగ భద్రత కల్పించాలని ఏఎన్ఎంల ఆందోళన
ప్రకాశం జిల్లా ఒంగోలులో ఏఎన్ఎంలు కలెక్టరేట్ ముట్టడికి దిగారు. గ్రామ సచివాలయంలో తమను ఉద్యోగులుగా తీసుకొన్న తర్వాతే మిగిలిన ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరుతూ నిరసన చేపట్టారు.
ఏఎన్ఎంల కలెక్టరేట్ ముట్టడి