ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 31, 2020, 10:59 AM IST

ETV Bharat / state

రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధికి ఆమడదూరంలో ఉంది..!

రాబోయే రోజుల్లో రాష్ట్రంలో జనసేన, భాజపాలు అధికారం కైవసం చేసుకుంటాయని ప్రకాశం జిల్లా చీరాల జనసేన పార్టీ నాయకుడు శివరామప్రసాద్ అన్నారు. ప్రస్తుతం రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడి ఉందని విమర్శించారు.

bjp,janasena party meeting at cheerala
చీరాలలో జనసేన భాజాపా సదస్సు

వైకాపాపై జనసేన నాయకుల విమర్శలు

రాష్ట్రంలో భాజపా, జనసేనలు త్వరలోనే అధికారం కైవసం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నాయని ప్రకాశం జిల్లా చీరాల జనసేన పార్టీ నాయకుడు శివరామప్రసాద్ తెలిపారు. రోటరీ సామాజిక భవనంలో ఇరు పార్టీల నాయకులు సమావేశం నిర్వహించారు. రాష్ట్రాభివృద్దికోసం ఇరుపార్టీలు కలిసి పనిచేయటం సంతోషదాయకమని నాయకులు చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వం వింత పోకడలు పోతుందని ప్రజలు నానా కష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్ధికంగానే కాదు అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధికి ఆమడదూరంలో ఉందని ఆరోపించారు. ఈ దశలో జనసేన, భాజపాలు కలసి అడుగులు వేయడం చాలా శుభపరిణామమని అన్నారు.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details