గణనాథుడు గంగమ్మ చెంతకు... వ్యర్థాలు సాగరతీరానికి!
ప్రకాశం జిల్లా చీరాల మండలం వాడరేవు సముద్రతీరానికి గణనాథుడి విగ్రహాలు తరలివస్తున్నాయి. పెద్ద ఎత్తున నిమజ్జనాలతో సాగరతీరం అంతా వ్యర్థాలతో నిండిపోయింది.
నాలుగు రోజులుగా పూజలందుకున్న గణనాథుడి విగ్రహాలు.. గంగమ్మ ఒడికి చేరుకుంటున్నాయి. ప్రకాశం జిల్లా చీరాల మండలం వాడరేవు సమీపంలోని సముద్ర తీరానికి.. చుట్టు పక్కల గ్రామాల నుంచి వినాయకుడి విగ్రహాలను నిమజ్జనం కోసం భక్తులు తీసుకువస్తున్నారు. చాలా విగ్రహాలు ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్తో తయారై ఉన్న కారణంగా.. నిమజ్జనం అనంతరం అలల తాకిడికి వ్యర్థాలు తీరానికి కొట్టుకువస్తున్నాయి. ఆ ప్రాంతమంతా వాటితోనే నిండిపోయింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి తీరాన్ని కాలుష్యంబారి నుంచి కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.