ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రైలులో బ్యాగ్ మరిచిపోయినా.. పోలీసులు తెచ్చిచ్చారు

రైలులో మరిచిపోయిన బ్యాగ్​ను ప్రకాశం జిల్లా మార్కాపురం రైల్వే పోలీసులు... బాధితురాలికి అందజేశారు.

By

Published : Jul 16, 2019, 2:07 AM IST

పోగొట్టుకున్న బ్యాగ్​ను కనిపెట్టిన పోలీసులు

పోగొట్టుకున్న బ్యాగ్​ను కనిపెట్టిన పోలీసులు

నరసరావుపేట నుంచి నంద్యాల వెళ్లేందుకు పవన్ కుమార్ దేశాయ్ అనే మహిళ రైలెక్కింది. తమ కూతురు ఆరోగ్యం బాగోలేదని కబురు రాగా.. హడావుడిగా రైలులోనే బ్యాగ్ మరచిపోయి వినుకొండ రైల్వే స్టేషన్​లో దిగింది. కొంత సమయం తరువాత బ్యాగ్ మరిచిపోయినట్లు గ్రహించిన ఆమె వినుకొండ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు అక్కడి నుంచి మార్కాపురం రైల్వే పోలీసులకు సమాచారమిచ్చారు. మార్కాపురంలో నిలిచిన రైలు నుంచి బ్యాగ్​ను ఆర్పీఎఫ్​ పోలీసులు స్వాధీనం చేసుకుని బాధితురాలికి అప్పగించారు. బ్యాగ్​లో బంగారు ఆభరణాలు, నగదు, మూడు చరవాణులు అన్నీ ఉన్నందున పోలీసులకు ఆమె కృతజ్ఞతలు తెలిపింది.

ABOUT THE AUTHOR

...view details