ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దారుణం: విద్యుత్​ షాక్​ పెట్టి​ భార్యను చంపేశాడు..!

రాష్ట్రంలో నేరాలు రోజురోజుకూ పెచ్చుమీరుతున్నాయి. మొన్న అత్తను నరికి చంపాడో అల్లుడు.. నిన్న ఆస్తికోసం తల్లిని హత్య చేశాడో కుమారుడు. ఇవాళ భార్యను కరెంట్​ షాక్​ పెట్టి మరీ..హతమార్చాడో భర్త.

By

Published : Jul 30, 2019, 12:31 PM IST

Updated : Jul 30, 2019, 12:37 PM IST

విద్యుత్​ షాక్​ పెట్టి భార్యను చంపేశాడు..!

ఇంత దారుణంగా చంపుతారా..!

ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం మద్దలకట్టలో దారుణం జరిగింది. భార్యకు విద్యుత్​షాక్​ పెట్టి చంపేశాడో ఓ భర్త. శ్రావణి-యోహను దంపతులు ఎస్సీ పాలెంలో నివాసం ఉంటున్నారు. నిత్యం మద్యం సేవించి భార్యతో ఘర్షణ పడేవాడని స్థానికులు తెలిపారు. ఏమైందో ఏమో తెలీదు కట్టుకున్నవాడే రాక్షసంగా హత్య చేశాడు. భార్య మెడకు విద్యుత్​ తీగలు బిగించి..షాక్​ ఇచ్చీ మరీ హతమార్చాడు. అనంతరం కుటంబసభ్యులతో సహా పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Last Updated : Jul 30, 2019, 12:37 PM IST

ABOUT THE AUTHOR

...view details