గుంటూరు నుంచి ప్రకాశం జిల్లా పర్చూరుకు కారులో అక్రమంగా తరలిస్తున్న 10 లక్షల విలువైన గుట్కా, ఖైనీ ప్యాకెట్లను ప్రత్తిపాడు వద్ద ఎస్ఈబీ అధికారులు పట్టుకున్నారు. ప్రత్తిపాడు, పెదనందిపాడు మండలాల్లో పలు దుకాణాలకు ఈ ప్యాకెట్లు సరఫరా చేసేందుకు తీసుకువెళ్తున్నారని పోలీసులు తెలిపారు. ముందస్తు సమాచారంతో గుంటూరు నుంచి ఆ వాహనాన్ని వెంబడించినట్లు చెప్పారు. ఆ బస్తాలను సీజ్ చేసి ప్రత్తిపాడు ఎస్సైకి అప్పగించారు. పర్చూరుకు చెందిన హోటల్ నిర్వాహకుడు శేషుకృష్ణ, వరగానికి చెందిన కొత్తమాసు సుధాకర్ను అదుపులోకి తీసుకున్నామని, కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
10లక్షల విలువ గల గుట్కా, ఖైనీ ప్యాకెట్ల పట్టివేత
10 లక్షల విలువైన గుట్కా, ఖైనీ ప్యాకెట్లను ప్రత్తిపాడు వద్ద ఎస్ఈబీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు నుంచి ప్రకాశం జిల్లా పర్చూరుకు కారులో అక్రమంగా తరలిస్తుండగా ముందస్తు సమాచారం మేరకు పట్టుకున్నారు.
10లక్షల విలువ గల గుట్కా,ఖైని ప్యాకేట్ బస్తాల పట్టివేత