ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దర్గాకు వెళ్తుండగా ప్రమాదం.. ఒకరి పరిస్థితి విషమం

నెల్లూరు జిల్లాలోని ముస్తాపురం వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగం కారణంగా కారుబోల్తా పడి.. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

By

Published : Aug 13, 2019, 10:04 AM IST

రోడ్డు ప్రమాదం

నెల్లూరు జిల్లా ఏఎస్ పేట మండలం ముస్తాపురం గ్రామ సమీపంలో కారు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో అందులో ఉన్న ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఆత్మకూరు ప్రభుత్వ హాస్పిటల్​లో క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. కడప నుంచి ఏఎస్‌ పేటలోని శ్రీ ఖాజా నాయబ్‌ రసూల్ దర్గాకు వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. అతి వేగమే ప్రమాదానికి కారణమని సమాచారం.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details