ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చోరీకి వచ్చారు... బైక్, సామగ్రి అక్కడే మరిచారు!

నెల్లూరు జిల్లా గాంధీ జన సంఘలోని ఓ ఇంట్లో దొంగలు పడ్డారు. యజమానికి మెలకువ వచ్చి... కేకలు వేయగా పారిపోయారు. బైక్ తో పాటు ఇతర సామాగ్రి అక్కడే వదిలేశారు.

By

Published : Jun 23, 2019, 1:58 PM IST

'చోరీకి వచ్చారు... బైక్, సామాగ్రిని అక్కడే మరిచారు'

'చోరీకి వచ్చారు... బైక్, సామాగ్రిని అక్కడే మరిచారు'

నెల్లూరు జిల్లా సంగం మండలం గాంధీజన సంఘంలో దొంగలు హల్ చల్ సృష్టించారు. అర్థరాత్రి ఓ ఇంట్లో చొరబడి దొంగతనం చేసేందకు ప్రయత్నించగా... అక్కడే నిద్రిస్తున్న మహిళకు మెలుకువ వచ్చి కేకలు వేసింది. వెంటనే దొంగలు అప్రమత్తమై అక్కడి నుంచి పారిపోయారు. వారు తీసుకువచ్చిన ద్విచక్రవాహనం, గడ్డపారలు.. ఇతర సామగ్రి సంఘటనా స్థలం వద్దే వదిలి వెళ్లారు. ఈ విషయంపై పోలీసులకు గ్రామస్థులు సమాచారం ఇవ్వగా... వారు సంఘటనా స్థలానికి చేరుకుని వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. దొంగల ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details