ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 27, 2020, 11:27 AM IST

ETV Bharat / state

గుర్తుతెలియని వాహనం ఢీకొట్టి వ్యక్తి మృతి

గుర్తుతెలియని వాహనం ఢీకొట్టి వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన నెల్లూరు జిల్లా వింజమూరు, కలిగిరి రహదారిపై జరిగింది.

road accident in vinjamur nellore district
వింజమూరు, కలిగిరి రహదారి పై రోడ్డు ప్రమాదం...వ్యక్తి మృతి

నెల్లూరు జిల్లా వింజమూరు, కలిగిరి మార్గంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రకాశం జిల్లా కురిచేడు గ్రామానికి చెందిన పెంచలయ్య(32) వింజమూరు మండలంలో ప్రకృతి వ్యవసాయం సిఎంఆర్​పిగా పనిచేస్తున్నాడు. వింజమూరు నుంచి కలిగిరికి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా బొమ్మరాజు చెరువు సమీపంలో గుర్తు తెలియని వాహనం అతన్ని ఢీ కొట్టింది.

తలకు బలమైన గాయం కావటంతో పెంచలయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. అటువైపుగా వెళ్తున్న ప్రయాణికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సీఐ రవికిరణ్ ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.

ఇదీచదవండి: సకాలంలో చేరుకోని 108 వాహనాలు

ABOUT THE AUTHOR

...view details