నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం కరటంపాడు గ్రామంలో కొండచిలువ కలకలం రేగింది. గ్రామ శివారు ప్రాంతంలో యువకులకు ఓ భారీ కొండచిలువ కనిపించింది. వారు దానిని గ్రామ సచివాలయం వద్దకు చేర్చి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. కొండచిలువను చూసేందుకు గ్రామంలోని ప్రజలు సచివాలయం వద్దకు చేరుకున్నారు. అటవీశాఖ అధికారులు కొండచిలువను స్వాధీనం చేసుకుని.. అటవీ ప్రాంతంలో వదిలి పెట్టారు.
కరటంపాడులో కొండచిలువ కలకలం
నెల్లూరు జిల్లా కరటంపాడులో గ్రామంలో కొండచిలువ కలకలం రేగింది. గ్రామ సమీపంలో.. యువకులకు ఓ భారీ కొండచిలువ కనిపించగా.. అటవీ అధికారులకు సమాచారమిచ్చారు. వారు దానిని అటవీ ప్రాంతంలో వదిలేశారు.
python in karatampadu