ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వరి రైతుల కష్టాలు... రైతు భరోసా కేంద్రాల్లో జరగని కొనుగోళ్లు!

గతేడాది తుపానులు, వరదల కారణంగా పంట నీట మునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇప్పుడు చేతికి అందివచ్చిన పంటను అమ్ముకునేందుకు ఇబ్బందిపడుతున్నారు. రైతు భరోసా కేంద్రాల వద్ద ధాన్యం రాశులు పోసి.. పంటను ఎప్పుడు కొనుగోలు చేస్తారో అని ఆశగా ఎదురుచూస్తున్నారు... నెల్లూరు జిల్లా రైతులు.

By

Published : Apr 6, 2021, 7:08 PM IST

rbk
వరి రైతుల కష్టాలు.

కొనుగోళ్లు జరగక రైతుల కష్టాలు

నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని వరి రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. మండలంలోని కరటం పాడు గ్రామ పరిసర ప్రాంతాల్లో 1200 ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. పంటను కోసి.. రైతు భరోసా కేంద్రాల వద్ద తమకు కేటాయించిన ప్రాంతాల్లో ధాన్యాన్ని కుప్పలుగా పోశారు. అధికారులు ఎప్పుడు తమ పంటను కొనుగోలు చేస్తారో అని ఆశగా ఎదురుచూస్తున్నారు.

జిల్లా కేంద్రం నుంచి అనుమతులు రాలేదంటూ అధికారులు చడీ చప్పుడు లేకుండా ఉంటున్నారు. మరోవైపు.. ధాన్యం రాశులను కాపాడుకుంటూ రైతులు అక్కడే తిని, అక్కడే పడుకుంటున్నారు. వారం క్రితం లారీల్లో ఎక్కించిన ధాన్యం బస్తాలు సైతం వాహనాలతో సహా అక్కడే నిలిచిపోయాయి. ఇదిలా ఉంటే.. రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో దళారులు మోసాలకు పాల్పడుతున్నారు. పుట్టికి ప్రభుత్వం నిర్ణయించిన ధర రూ.16,500 ఉండగా... అప్పుల బాధతో కొందరు రైతులు రూ.12వేలకే అమ్ముకుంటున్నారు.

ఇటీవల ఆత్మకూరు మార్కెట్ కమిటీ పరిధిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను అధికారులు ప్రారంభించారు. కానీ.. ఇప్పటివరకు ఆ కేంద్రాల ద్వారా ఎంత ధాన్యం కొనుగోలు చేశారనేది తెలియలేదు. 20% పంట చేతికి వచ్చిన సమయంలోనే పరిస్థితి ఇలా ఉంటే.. ముందుముందు ఇంకెలా ఉంటుందో అని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇకనైనా ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

ఇదీ చదవండి:

గసగసాల కేసులో మరో ఇద్దరి అరెస్టు

ABOUT THE AUTHOR

...view details