ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నెల్లూరులో రాష్ట్రపతి

రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్ నెల్లూరు చేరుకున్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో కలిసి అక్షర విద్యాలయంలో విద్యార్థులతో ముఖాముఖి

By

Published : Feb 22, 2019, 10:44 AM IST

Updated : Feb 22, 2019, 11:25 AM IST

రామ్​నాథ్ కోవింద్, రాష్ట్రపతి

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నెల్లూరు చేరుకున్నారు. హెలీప్యాడ్ నుంచి నేరుగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నివాసానికి వెళ్లారు. అనంతరం రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి వెంకటాచలం బయల్దేరివెళ్లారు. అక్షర విద్యాలయానికి వెళ్లి విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. అక్కడి నుంచి స్వర్ణభారతి ట్రస్ట్​కు వెళ్తారు. రాష్ట్రపతి పర్యటనలో మంత్రులు సోమిరెడ్డి, నారాయణ పాల్గొననున్నారు.

రామ్​నాథ్ కోవింద్, రాష్ట్రపతి
Last Updated : Feb 22, 2019, 11:25 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details