ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 19, 2019, 3:22 PM IST

ETV Bharat / state

ప్రత్యేక హోదాకై... దివ్యాంగుడి అలుపెరుగని పోరాటం

ఓ దివ్యాంగుడు తన మూడు చక్రాల సైకిల్​పై యాత్ర చేపట్టాడు. తన యాత్రను పూర్తి చేసి గిన్నిస్​ రికార్డు సాధించాలనుకోలేదు. తన కుటుంబాన్ని పోషించటానికి అంతకన్నా కాదు. కానీ ఎండావాన తేడా లేకుండా కష్టపడుతున్నాడు. తన కోసం కాకుండా భవిష్యత్​ తరాల కోసం ఆ యాత్ర చేస్తున్నాడు. ఎవరా వ్యక్తి.. ఏంటా యాత్ర...

physically challenged person struggle for special status

ప్రత్యేక హోదా కోసం దివ్యాంగుడి అలుపెరుగని పోరాటం

ఓ దివ్యాంగుడు సైకిల్​పై యాత్ర చేపట్టాడు. అది తన కోసం కాదు.. ఏపీ రాష్ట్ర భవిష్యత్​ కోసం. శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం బూరగాం గ్రామానికి చెందిన నెయ్యాల ప్రసాద్... ప్రత్యేక హోదా కోసం సైకిల్​ యాత్రకు పూనుకున్నాడు. ఇచ్ఛాపురం నుంచి అనంతపురం వరకు 1460 కిలోమీటర్లు యాత్ర చేస్తున్నట్లు ప్రసాద్ తెలిపారు. గత ఏడాది ఆగస్టు 12వ తేదీన ఇచ్ఛాపురంలో ప్రారంభమైన ఈ యాత్ర కృష్ణా జిల్లా చేరుకుకన్న తర్వాత ఎన్నికల కారణంగా నిలిపివేశారు. అనంతరం ఈ ఏడాది సెప్టెంబర్ 18వ తేదీన తిరిగి కృష్ణా జిల్లా నుంచి యాత్ర చేపట్టిన ప్రసాద్ ప్రస్తుతం నెల్లూరు కలెక్టరేట్​కు చేరుకున్నాడు. అనంతపురం నుంచి ఢిల్లీకి వెళ్లి హోదా కోరుతూ ఉపరాష్ట్రపతి, ప్రధానులకు వినతి పత్రం అందజేస్తామన్నారు. ప్రత్యేక హోదా ద్వారానే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని, హోదాతో పాటు విశాఖ రైల్వే జోన్ ఇవ్వాలని ఆయన కోరారు.

ABOUT THE AUTHOR

...view details