ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 17, 2021, 12:29 PM IST

ETV Bharat / state

షరతులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలి: సోమిరెడ్డి

ప్రభుత్వం ఎలాంటి షరతులు విధించకుండా.. ఎంటీయూ 1010 రకం ధాన్యం కొనుగోలు చేయాలని తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు నెల్లూరు కలెక్టర్​కు లేఖ రాశారు.

Former Minister Somireddy Chandramohan Reddy's letter to the Nellore Collector
Former Minister Somireddy Chandramohan Reddy's letter to the Nellore Collector

నెల్లూరు కలెక్టర్‌ చక్రధర్ బాబుకు మాజీ మంత్రి, తెదేపా సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి లేఖ రాశారు. ఎలాంటి షరతులు విధించకుండా ఎంటీయూ 1010 రకం ధాన్యం కొనుగోలు చేయాలని లేఖలో పేర్కొన్నారు.

ప్రస్తుతం పుట్టికి 1050-1200 కిలోలు తీసుకుంటున్నారని.. పుట్టికి 850 కిలోలు తీసుకుని కనీస మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేశారు. గత సీజన్ ధాన్యం బకాయిలను వెంటనే చెల్లించాలని లేఖలో డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details