ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మర్రిపాడులో భూప్రకంపనలు... భయాందోళనలో ప్రజలు

మర్రిపాడులో భూమి కంపించింది. ఒక్కసారిగా ప్రకంపనలు రావడంతో ప్రజలు పరుగులు తీశారు. ఏ జరుగుతుందో అర్థంకాక ఆందోళనకు గురయ్యారు.

By

Published : Jul 13, 2019, 12:06 PM IST

Updated : Jul 13, 2019, 12:41 PM IST

earthquake

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలో భూమి స్వల్పంగా కంపించింది. భూ ప్రకంపనలతో భయభ్రాంతులకు గురై ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. మర్రిపాడు, పల్లవోలు, తిక్కవరం, అల్లంపాడు, చిలకపాడు, ఎపిలగుంట గ్రామాల్లో భూమి స్వల్పంగా కంపించిందని గ్రామస్థులు తెలిపారు. శుక్రవారం సాయంత్రం సైతం ఇలానే ప్రకంపనలు వచ్చాయని చెప్పారు. ప్రకంపనలతో ఇళ్లు అక్కడక్కడా బీటలు వారాయి.

మర్రిపాడు పరిసర ప్రాంతాల్లో స్వల్ప భూ ప్రకంపనలు
Last Updated : Jul 13, 2019, 12:41 PM IST

ABOUT THE AUTHOR

...view details