ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Sep 25, 2019, 9:43 AM IST

ETV Bharat / state

ప్రభుత్వ పథకాలు ఇప్పిస్తామని మహిళలకు టోకరా..!

ప్రభుత్వ పథకాలకు ఎంపిక చేసి... నగదు అందచేస్తామని కొందరు మోసం చేసిన ఉదంతం ఆలస్యంగా వెలుగుచూసింది. కర్నూలు జిల్లా నంద్యాలలో నలుగురు వ్యక్తులు ఈ మోసానికి పాల్పడ్డారు. వారిని పోలీసులు అరెస్టు చేశారు.

ప్రభుత్వ పథకాలు ఇప్పిస్తామని మోసం

గత ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన బంగారుతల్లి, ఒంటరి మహిళ పథకాల్లో లబ్ధిదారులే లక్ష్యంగా కొందరు మోసగాళ్లు దందాలకు తెరతీస్తున్నారు. కర్నూలు జిల్లాలో జరిగిన ఇలాంటి మోసం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నంద్యాలలో నలుగురు వ్యక్తులు ప్రజల నుంచి రూ.13 లక్షలు వసూలు చేశారు. పట్టణంలో దేవనగర్ చెందిన నలుగురు వ్యక్తులు దేవనగర్, వీసీ కాలనీ, రెవెన్యూ క్వార్టర్స్ ప్రాంతాలకు చెందిన 200 మంది నుంచి రూ.13 లక్షలు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు. వారిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు.

ప్రభుత్వ పథకాలు ఇప్పిస్తామని మోసం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details