ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నీటి కోసం గొడవ.. ప్రాణాలు కోల్పోయిన మహిళ

తాగునీటి కోసం వెళ్లి ఒక మహిళ ప్రాణాలు కోల్పోయిన ఘటన కర్నూలు జిల్లా కడమకుంట్లలో జరిగింది. నీరు పట్టుకునే విషయంలో మహిళల మధ్య జరిగిన ఘర్షణ ఆమె ప్రాణాలు తీసింది.

By

Published : May 21, 2019, 1:27 PM IST

నీటి కోసం వెళ్లి.. ప్రాణాలు కోల్పోయింది

నీటి కోసం వెళ్లి.. ప్రాణాలు కోల్పోయింది

కర్నూలు జిల్లా తుగ్గలి మండలం కడమకుంట్లలో విషాదం చోటు చేసుకుంది. తాగునీరు పట్టుకునే విషయంలో తోపులాట జరిగి పద్మావతి అనే మహిళ మృతి చెందింది. నిన్న రాత్రి నీటి దగ్గర మహిళల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో సొమ్మసిల్లి పడిపోయిన పద్మావతిని ఆసుపత్రికి తరలించారు. పత్తికొండ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె ఈరోజు మరణించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details