ఆంధ్రప్రదేశ్

andhra pradesh

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రవాహం

By

Published : Aug 10, 2020, 9:45 AM IST

శ్రీశైలం జలాశయానికి వరద నీరు వచ్చి చేరుతోంది. జూరాల నుంచి 1,89,531 క్యూసెక్కుల నీరు జలాశయంలోకి వచ్చింది.

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రవాహం
శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రవాహం

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రవాహం

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. జూరాల నుంచి 1,89,531 క్యూసెక్కులు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం జలాశయం ఇన్‌ఫ్లో 2,69,453 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 858.70 అడుగులకు నీరు చేరింది. జలాశయంలో ప్రస్తుత నీటి నిల్వ 101.92 టీఎంసీలుగా ఉంది. శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 42,000 క్యూసెక్కులు విడుదల చేశారు. హంద్రీనీవా ఎత్తిపోతలకు 1,688 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ద్వారా 2,000 క్యూసెక్కులు వదిలారు.

ABOUT THE AUTHOR

...view details