ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తాగునీటికోసం ఖాళీ బిందెలతో నిరసన

వారం రోజులుగా తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని.. గూడూరులో మహిళలు, పార్టీ సంఘాల నేతలు రోడ్డుపై బైఠాయించారు.

By

Published : Aug 22, 2019, 11:57 PM IST

నీటి కోసం ధర్నా

ఖాళీ బిందెలతో రోడెక్కిన స్థానికులు

కర్నూలు జిల్లా గూడూరు నగర పంచాయతి పరిధిలో వారం రోజులుగా తాగునీరు రావటం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికంగా ఉన్న బస్టాండ్ కూడలిలో ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. కమిషనర్​కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ సమస్య పరిష్కరించేవరకు ఆందోళన విరమించేది లేదన్నారు. ఇంఛార్జ్ కమిషనర్​, ఏఈ పవన్​కుమార్​రెడ్డికి పోలీసులు వీరి డిమాండ్ పై సమాచారమిచ్చారు. సమస్యను పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇచ్చి.. పరిస్థితి సద్దుమణిగేలా చేశారు. ఆందోళన కారణంగా... సుమారు అరగంటపాటు వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

ABOUT THE AUTHOR

...view details