కర్నూలు జిల్లా ఆదోని మండలం కడితోట గ్రామానికి చెందిన అనిల్, వీరేంద్రలు సమీపంలోని పొలంలో ఆడుకోవడానికి వెళ్లారు. అక్కడే ఉన్న నీటి కుంటలో సరదాగా ఈత కొట్టేందుకు దిగారు. ప్రమాదవశాత్తు నీట మునిగిపోయారు. గమనించిన స్థానికులు.. చిన్నారులను బయటకు తీసి ఆస్పత్రికి తరలించేలోగా మృతి చెందారు. కంటికి రెప్పలా కాపాడుకుంటున్న తమ పిల్లలు మృత్యువాత పడటంతో తల్లిదండ్రులు రోదించిన తీరు కంటతడి పెట్టించింది.
విషాదం : నీటి కుంటలో పడి ఇద్దరు చిన్నారులు మృతి
కర్నూలు జిల్లాలో విషాదం నెలకొంది. కడితోట గ్రామంలో సరదాగా ఈతకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు నీట మునిగి మృతి చెందారు.
నీటి కుంటలో పడి ఇద్దరు చిన్నారులు మృతి