ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నేడే కర్నూలుకు చంద్రబాబు

నేడే కర్నూలు జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌లోని కీలక నేతలు పార్టీలో చేరనున్నారు.

By

Published : Mar 1, 2019, 11:23 PM IST

Updated : Mar 2, 2019, 10:18 AM IST

నేడే కర్నూల్లో సీఎం పర్యటన

నేడే కర్నూల్లో సీఎం పర్యటన

ముఖ్యమంత్రి చంద్రబాబుకర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం కోడుమూరులో బహిరంగసభలో పాల్గొంటారు. గుండ్రేవుల, వేదవతి ప్రాజెక్టులకు, ఆర్డీఎస్, ఎల్‌ఎల్‌సీ పైపులైన్‌ పనులకు శంకుస్థాపన చేస్తారు.బహిరంగ సభ స్థలాన్ని తెదేపా జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, మాజీ మంత్రి కోట్ల జయ సూర్య ప్రకాశ్ రెడ్డి పరిశీలించారు. వేదికను, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన శిలాఫలకాల నిర్మాణం పనుల వివరాలు తెలుసుకున్నారు.

తెదేపాలో చేరనున్న కోట్ల కుటుంబం

ప్రభుత్వ కార్యక్రమాలు ముగిసిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి దంపతులు, వారి కుమారుడు కోట్ల రాఘవేంద్ర రెడ్డి,అనుచరులు సీఎం సమక్షంలో పార్టీలో చేరనున్నారు.

తెదేపా గూటికి చలమలశెట్టి

Last Updated : Mar 2, 2019, 10:18 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details