ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పదో తరగతి మూల్యాంకన ఉపాధ్యాయుల ఆందోళన

పదో తరగతి మూల్యాంకన విధులు నిర్వహిస్తున్న ప్రత్యేక అసిస్టెంట్లకు టీఏ, డీఏ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్​ చేస్తూ ఉపాధ్యాయులు ఆందోళన బాట పట్టారు. వేసవి సెలవుల్లో పని చేసే వారికి ఈఎల్​ఎస్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.

By

Published : Apr 19, 2019, 7:47 PM IST

కర్నూల్లో ఉపాధ్యాయుల ఆందోళన

కర్నూల్లో ఉపాధ్యాయుల ఆందోళన

పదో తరగతి మూల్యాంకన విధులు నిర్వహిస్తున్న ప్రత్యేక అసిస్టెంట్లకు టీఏ, డీఏ సౌకర్యాలు కల్పించాలని.. కర్నూల్​లో ఉపాధ్యాయులు ఆందోళన చేశారు. మూల్యాంకనం జరుగుతున్న మాంటిస్సోరి పాఠశాల వద్ద విధులు బహిష్కరించి నిరసన చేపట్టారు. వీరికి ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి మద్దతు తెలిపారు. వేసవి సెలవుల్లో పని చేసేవారికి ఈఎల్​ఎస్ సౌకర్యం కల్పించాలనీ.. రోజుకు 60 పేపర్లు మాత్రమే స్క్రూటినీ చేసే విధంగా చూడాలని డిమాండ్ చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details