ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 18, 2020, 10:21 PM IST

ETV Bharat / state

'వైకాపా ఏడాది పాలనలో చేసిన అభివృద్ది ఏమీ లేదు'

వైకాపా ఏడాది పాలనపై కర్నూలు జిల్లా నంద్యాల పార్లమెంట్ తెదేపా ఇన్చార్జ్ మాండ్ర శివానందరెడ్డి ధ్వజమెత్తారు. ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు పనులు మందగతిన నడుస్తున్నాయని ఆవేదన చెందారు

tdp nandyala incharge fired on ycp govt one year ruling
tdp nandyala incharge fired on ycp govt one year ruling

వైకాపా ప్రభుత్వం ఏడాది పాలనలో చేసిందేమీ లేదని తెలుగుదేశం పార్టీ ధ్వజమెత్తింది. రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ది జరగలేదని ఆ పార్టీ నంద్యాల పార్లమెంట్ ఇన్చార్జ్ మాండ్ర శివానందరెడ్డి ఆరోపించారు. పోలవరం ప్రాజక్టు పనులు ముందుకు కదలటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సిమెంట్, ఇసుక ధరలు భారీగా పెరిగాయని భవన నిర్మాణ రంగం కుదేలైందని వేలాది మంది కార్మికులు పనులు లేకుండా రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.. అచ్చెన్నాయుడి విషయంలో కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details