ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 14, 2021, 9:44 AM IST

ETV Bharat / state

'ప్రభుత్వ ఉదాసీనత వల్లే దేవాలయాలపై దాడులు'

ప్రభుత్వ ఉదాసీనత వల్లే రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని తెదేపా వేమూరి ఆనందసూర్య తెలిపారు. కర్నూలు జిల్లా యనగండ్లలో నందీశ్వరుని విగ్రహం చోరీకి గురైంది. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

tdp leader vemuri ananda surya
తెదేపా ఉపాధ్యక్షుడు వేమూరి ఆనంద సూర్య

కర్నూలు జిల్లా యనగండ్లలో నందీశ్వరుని విగ్రహాన్ని చోరీ చేయడం దుర్మార్గమని తెదేపా ఉపాధ్యక్షుడు వేమూరి ఆనంద సూర్య మండిపడ్డారు. ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం వెంటనే నిందితులను గుర్తించి.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. విగ్రహాలపై దాడులు ఆపకపోతే దేవుని ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ప్రభుత్వ ఉదాసీనత వల్లే దేవాలయాలపై దాడులు పెరుగుతున్నాయన్నారు. వైకాపా నేతలు దేవుళ్ల పట్ల లెక్కలేనితనంగా వైకాపా వ్యవహరిస్తున్నారని ఆక్షేపించారు.

ABOUT THE AUTHOR

...view details