ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 27, 2020, 2:37 PM IST

ETV Bharat / state

వీడియో వైరల్: కరోనా బాధితులను పట్టించుకోని ఆస్పత్రి సిబ్బంది

కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలోని శాంతిరాం వైద్యశాలలో కరోనా బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోగులను పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని రోజుల వ్యవధిలోనే రెండు సంఘటనలు చోటు చేసుకోవడం వల్ల బాధితులు ఆందోళన చెందుతున్నారు.

nadyala santhiram hospital
కరోనా బాధితులను పట్టించుకోని సిబ్బంది

కరోనా బాధితులను పట్టించుకోని సిబ్బంది

కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలోని శాంతిరాం వైద్యశాలలో కరోనా బాధితులు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధితులను పట్టించుకోవడం లేదని సిబ్బందితో గొడవ పడ్డారు. వైద్యశాలలో జరుగుతున్న సంఘటనలను కొందరు సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. బాధితులను ఎక్కువగా వైద్యశాలకు తరలిస్తుండటం.. అందరికీ సరిపడా సౌకర్యాలు కల్పించలేకపోతున్నట్లు సంబంధిత అధికారులు చెబుతుండటం గమనార్హం. వారం రోజుల క్రితం ఇదే వైద్యశాలలో బాధితులు పడిన కష్టాలను వీడియో తీసి సామాజిక మద్యమాల్లో ఉంచడం ఆ వీడియో వైరల్ అయ్యింది. కొన్ని రోజుల వ్యవధిలోనే మరో సంఘటన చోటు చేసుకోవడంతో బాధితుల్లో ఆందోళన నెలకొంది.

ABOUT THE AUTHOR

...view details