ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 1, 2020, 4:02 PM IST

ETV Bharat / state

పిడుగుపాటుకు గురై 60 గొర్రెలు మృత్యువాత

పిడుగుపాటుకు గురై కర్నూలు జిల్లాలో 60 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. గొర్రెలు చనిపోవడం వల్ల సుమారు పది లక్షల నష్టం వాటిల్లిందని గొర్రెల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

sheeps died in kurnool dst due to  Thunderbolt
sheeps died in kurnool dst due to Thunderbolt

పిడుగు పాటుకు గురై 60 గొర్రెలు మృత్యువాత పడిన ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది. కర్నూలు మండలం గార్గేయపురంలో రాత్రి మెరుపులతో కుడిన వర్షం కురిసింది. దీంతో పిడుగు పాటుకు గురై 60 గొర్రెలు మృతి చెందాయి. పది లక్షల రూపాయలు నష్టం జరిగిందని, ప్రభుత్వం ఆదుకోవాలని గొర్రెల పెంపకం దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details