కర్నూలు జిల్లా డోన్ రైల్వే స్టేషన్ను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన మాల్యా సందర్శించారు. స్టేషన్ ఆవరణ పరిసరాలను పరిశీలించారు. నిఘా కెమెరాలను ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. కల్లూరు- గుత్తి- పెండేకల్ రైల్వే డబ్లింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. గూడ్స్ రైళ్లు అధికంగా ఉన్నందున ఫ్లాట్ ఫాంలు ఖాళీలేక పట్టణ శివార్లలో క్రాసింగ్ కోసం నిలపాల్సి వస్తుందని.. అదనపు ఫ్లాట్ ఫాంలను నిర్మించి సమస్యను పరిష్కారిస్తామన్నారు.
సిగ్నలింగ్ వ్యవస్థను మెరుగు పరచటంతో పాటు.. ప్రతి స్టేషన్ ను ఆధునీకరిస్తామని తెలిపారు. ప్రయాణికుల భద్రత కోసం అదనపు పోలీసు సిబ్బందిని నియమించి గస్తీని ముమ్మరం చేస్తామన్నారు. కర్నూలు నుంచి డోన్ వరకు తుంగభద్ర ఎక్స్ప్రెస్ను పొడిగిస్తామని తెలిపారు. గుంటూరు- నంద్యాల రైల్వే లైన్ పనులను శరవేగంగా పూర్తి చేయిస్తామన్నారు. డోన్ పట్టణంలో సమస్యగా ఉన్న పాతపేట అండర్ గ్రౌండ్ బ్రిడ్జి నిర్మాణ పనులను 6నెలల్లో పూర్తి చేయాలని డీఆర్ఎం విజయ్ ప్రతాప్ సింగ్ కు సూచించారు.
పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేస్తాం : దక్షిణ మధ్య రైల్వే జీఎం
డోన్ రైల్వేస్టేషన్ ను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన మాల్యా సందర్శించారు. స్టేషన్ పరిసరాలను పరిశీలించిన ఆయన పెండింగ్ పనులను పూర్తిచేస్తామన్నారు.
పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేస్తాం
ఇది కూడా చదవండి.