ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Sep 2, 2020, 5:26 PM IST

ETV Bharat / state

ప్రభుత్వ ఉద్యోగులే టార్గెట్.. ఏసీబీ అంటూ డబ్బు వసూళ్లు

ఏసీబీ అధికారులమని బెదిరిస్తూ... డబ్బులు వసూలు చేస్తున్న ఓ ముఠాను కర్నూలు పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ అధికారులే లక్ష్యంగా... ఈ వ్యవహారం నడుపుతున్నారు.

ప్రభుత్వ ఉద్యోగులు టార్గెట్.. ఏసీబీ అంటూ డబ్బు వసూళ్లు
ప్రభుత్వ ఉద్యోగులు టార్గెట్.. ఏసీబీ అంటూ డబ్బు వసూళ్లు

ఏసీబీ అధికారులమంటూ.. బెదిరింపులకు పాల్పడుతున్న ఆరుగురిని కర్నూలు పోలీసులు అరెస్టు చేశారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నట్లు ట్రైనీ ఎస్పీ శివకిషోర్ తెలిపారు. గతంలో ఏసీబీ అధికారినని బెదిరింపులకు పాల్పడి జైలుకెళ్లిన జయకృష్ణ... తన తోటి నేరస్థులతో ఓ ముఠాగా ఏర్పడి... ఇలాంటి బెదిరింపులకు పాల్పడుతున్నట్లు శివకిషోర్ వెల్లడించారు. ఇప్పటి వరకు సుమారు 70 నుంచి 80 మంది ఉద్యోగులను బెదిరించారని... 14 లక్షల 34 వేలు వసూలు చేశారని ట్రైనీ ఎస్పీ వివ1రించారు.

ప్రభుత్వ ఉద్యోగులు టార్గెట్.. ఏసీబీ అంటూ డబ్బు వసూళ్లు

ABOUT THE AUTHOR

...view details