కర్నూలు జిల్లా మంత్రాలయం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతనంగా నిర్మించనున్న భవనాలకు భూమి పూజ జరిగింది. రాఘవేంద్ర స్వామి పీఠాధిపతి శ్రీసుభుదేంద్ర తీర్థులు పూజ నిర్వహించారు.
నాబార్డు నిధులు ఐదు కోట్ల రూపాయలతో పాఠశాలలో30 గదులు నిర్మిస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల మాజీ అధ్యక్షుడు సీతారామిరెడ్డి, వైస్సార్సీపీ నాయకులు భీమిరెడ్డి, భీమన్న పాల్గొన్నారు.