కర్నూలు జిల్లాలోని మంత్రాలయం మండలం మాధవరానికి చెందిన బీటీ శ్రీనివాసులు, నాగమ్మ దంపతులకు భాగ్యలక్ష్మి, రాజశ్రీ, నవిత సంతానం. ఆ ముగ్గురు బాల్యంలోనే.. తల్లి నాగమ్మ మతి స్థిమితం కోల్పోయింది.పెద్ద కుమార్తె.. తన చెల్లెళ్ల చూసుకోవడానికి బడి మానేసింది. తండ్రి శ్రీనివాసులు పిల్లల బాగోగులు చూసుకుంటూ తోపుడు బండిపై పండ్ల వ్యాపారం చేసేవాడు.
కరోనా లాక్ డౌన్ తో ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. ఇంతలో.. వారి తండ్రి శ్రీనివాసులు పక్షవాతానికి గురై మంచం పట్టాడు. భారమంతా ఆడపిల్లలపైనే పడింది. చదువుకోవాలనే ఆశ ఉన్నా.. విధి లేక కూలీకి వెళ్తున్నారు. ఆ కాస్త సంపాదనతో జీవనమే భారం కాగా.. తల్లిదండ్రులకు వైద్యం చేయించలేని పరిస్థితి నెలకొంది. వారికి వైద్యం చేయించాలని దాతలను కోరుతున్నారు.