కర్నూలు జిల్లా కోడుమూరులో తాగునీటి కోసం ప్రజలు ఆందోళనలు చేశారు.కర్నూలు - బళ్లారి ప్రధాన రహదారిపై ద్విచక్ర వాహనాలు,డ్రమ్ములు అడ్డంగా పెట్టి.. ఖాళీ బిందెలతో రాస్తారోకో చేశారు. తాగునీరు రాక అల్లాడుతున్నామంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. సంఘటనాస్థలానికిఆర్డబ్ల్యుఎస్ ఏఈ, అధికారులు చేరుకుని పైప్ లైన్ మరమ్మతులు చేస్తున్నామని తెలిపారు. పనులు పూర్తి చేసిన వెంటనే నీరు అందిస్తామని నచ్చజెప్పారు. సీఐ జోక్యంతో రాస్తారోకోవిరమించారు. ప్రధాన రహదారిపై వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.
ఇవి చదవండి