ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మోదీ మళ్లీ ప్రధాని కావాలని మహిళ దేశ వ్యాప్త పర్యటన

ప్రధాని మోదీపై తనకున్న అభిమానాన్ని ఓ మహిళ వినూత్నంగా చాటుకుంటోంది. బుల్లెట్​పై దేశ వ్యాప్త పర్యటనను ప్రారంభించి... భాజపా తరఫున ప్రచారం చేస్తోంది. మోదీని మళ్లీ గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తోంది.

By

Published : Apr 4, 2019, 6:59 PM IST

భాజపా కార్యకర్తలతో రాజ్యలక్ష్మి

మోదీ అభిమాని
భాజపా గెలుపును కాంక్షిస్తూ రాజ్యలక్ష్మి అనే మహిళ చేపట్టిన ద్విచక్రవాహన ర్యాలీ కర్నూలు జిల్లాకు చేరుకుంది. మోదీకి పెద్ద వీరాభిమాని అయిన ఈమె... భాజపా తరఫున ప్రచారం చేస్తూ దేశవ్యాప్త పర్యటనను చేపడుతోంది. ఇప్పటికే 5 రాష్ట్రాలు పూర్తి చేసుకున్న ర్యాలీ...ఇప్పుడు ఏపీకి చేరింది. కర్నూలు పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి డాక్టర్ పార్థసారథి.. జెండా ఊపి నగరంలో ఈ ర్యాలీని ప్రారంభించారు. జిల్లాలో ముడురోజుల పాటు అన్ని నియోజకవర్గాలు పర్యటించి ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకునేలా అవగాహన కల్పిస్తానని రాజ్యలక్ష్మి తెలిపారు. నరేంద్రమోదీ మాస్క్‌లు ధరించి ప్రచారం నిర్వహిస్తున్నందున ప్రజలు ఆసక్తిగా తిలకించారు.

ABOUT THE AUTHOR

...view details