ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అప్పుల బాధ తాళలేక వ్యక్తి ఆత్మహత్య

కర్నూలు జిల్లా కోడుమూరులో విషాదం నెలకొంది. అప్పుల బాధ తాళలేక ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇంటి పెద్దను కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

By

Published : Jun 20, 2020, 7:35 PM IST

Man suicide with financial problems in kodumooru kurnool dstrict
అప్పుల బాధ తాళలేక వ్యక్తి ఆత్మహత్య

కర్నూలు జిల్లా కోడుమూరులోని సుందరయ్యనగర్​లో అప్పుల బాధ తాళలేక ఖాదర్ బేగ్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్​కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడు ఆకుకూరలు అమ్ముతూ కుటుంబాన్ని పోషించేవాడు. అతని భార్య ఫక్కూరుబేగం కూలీ పని చేస్తోంది. కాగా .. కొన్నేళ్ల క్రితం వీరు ఇల్లు నిర్మించుకున్నారు. ఈ క్రమంలో రూ.3 లక్షలు అప్పు చేశారు. అప్పులు ఎలా తీర్చాలో తెలియక మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు.

కన్నీరుమున్నీరైన కుటుంబం...

విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు మృతుడి ఇంటికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

ఇదీచదవండి.

నూరు శాతం ఆన్​లైన్ బోధన...ఆ కళాశాల సొంతం

ABOUT THE AUTHOR

...view details