ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 27, 2022, 7:44 PM IST

ETV Bharat / state

రాయలసీమకు తీవ్ర అన్యాయం చేసిన వ్యక్తిగా సీఎం జగన్ : టీడీపీ లీగల్ సెల్ అడ్వకేట్స్

Kurnool Lawyers: రాయలసీమకు తీవ్ర అన్యాయం చేసిన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలిచిపోతారని తెలుగుదేశం పార్టీ కర్నూలు జిల్లా లీగల్ సెల్ న్యాయవాదులు అన్నారు. జ్యుడీషియల్ అకాడమీ ఏర్పాటుకు ఇచ్చిన జీవో రద్దు చేసి మరో జీవోను ఇస్తే ముఖ్యమంత్రికి మద్దతు ఇచ్చిన న్యాయవాదులు ఇప్పుడు ఏం చేస్తున్నారని వారు ప్రశ్నించారు.

Kurnool Lawyers
కర్నూలు న్యాయవాదులు

Kurnool Lawyers: రాయలసీమకు తీవ్ర అన్యాయం చేసిన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలిచిపోతారని తెలుగుదేశం పార్టీ కర్నూలు జిల్లా లీగల్ సెల్ న్యాయవాదులు అన్నారు. కర్నూలు లో జ్యుడీషియల్ అకాడమీ ఏర్పాటు చేస్తున్నట్లు ఇచ్చిన జీవోను రద్దు చేస్తు మరో జీవోను రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందన్నారు. ముఖ్యమంత్రికి మద్దతు ఇచ్చిన న్యాయవాదులు ఇప్పుడు ఏం చేస్తున్నారని వారు ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన మూడు రాజదానుల్లో ఏ రాజధానైనా అభివృద్ధి చెందిందా అని అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఒకే రాజదాని ఉండాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ప్రజలను మోసం చేసేందుకు మూడు రాజధానులంటూ కాలయాపన చేస్తున్నారని వారు విమర్శించారు.
ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details