రైల్వేస్టేషన్ అనగానే.. అపరిశుభ్ర పరిసరాలు, ప్లాట్ఫాంలు, అరకొర సౌకర్యాలే గుర్తుకొస్తాయి. అలాంటి పరిస్థితిని మారుస్తోంది రైల్వేశాఖ. బ్రిటీష్కాలంలో నిర్మించిన.. అనేక స్టేషన్లను ఒక్కొక్కటిగా ఆధునీకరిస్తోంది. రాయలసీమ ముఖధ్వారంగా ఉండే.. కర్నూల్ స్టేషనే దీనికి నిదర్శనం. విమానాశ్రయాన్ని తలదన్నే హంగులతో.. ప్రయాణికుల్ని ఆకట్టుకుటోంది.
స్టేషన్ అభివృద్ధికి 25 కోట్లు
బ్రిటీష్ కాలంలో నిర్మించిన కర్నూలు రైల్వేస్టేషన్ను..అప్పటి నగర జనాభా, స్థాయినిబట్టి కర్నూలు టౌన్ స్టేషన్గా పేరు పెట్టారు. హాల్ట్, క్రాస్, టౌన్, సిటీ, క్లాస్–A సిటీ పేర్ల ప్రకారం..రైల్వే బోర్డు అభివృద్ధి పనులు చేపడుతుంటుంది. టౌన్ స్టేషన్ ఉన్న కారణంగా.. ఇన్నాళ్లు కర్నూలు రైల్వేస్టేషన్ అభివృద్ధికి నోచుకోలేదు. కర్నూలు పురపాలక స్థాయి నుంచి.. నగరపాలికగా మారడంతో.. రైల్వేస్టేషన్ను సైతం టౌన్ నుంచి సిటీగా మార్చాలని డిమాండ్ ఏర్పడింది. వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల ఆందోళనలతో.. 2014లో కర్నూలు సిటీగా ఏర్పడింది. ఫలితంగా 2018-19 బడ్జెట్లో స్టేషన్ అభివృద్ధికి 25 కోట్లు కేటాయించారు. అందులో.. 8 కోట్లు విడుదల చేయడంతో స్టేషన్ను అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు.