ఆగస్టు 5న అయోధ్యలో రామాలయ నిర్మాణ పనులు ప్రారంభించనున్నారు. ఆ ప్రారంభోత్సవానికి కర్నూలు జిల్లాలోని పవిత్ర వైష్ణవ పుణ్యక్షేత్రం అహోబిలం నుంచి పవిత్ర మట్టి, జలాలను తీసుకువెళ్లారు. అహోబిలం పీఠాధిపతి ఆదేశాల మేరకు పుట్ట బంగారు మంటపం వద్ద ఉన్న మట్టిని, సమీపంలోని భవనాశి నదిలోని పవిత్ర జలాలకు పూజ చేసి తీసుకువెళ్లారు.
అయోధ్యకు అహోబిలం నుంచి పవిత్ర మట్టి, జలాలు
కర్నూలు జిల్లాలోని పవిత్ర వైష్ణవ పుణ్యక్షేత్రం అహోబిలం నుంచి పవిత్ర మట్టి, జలాలను అయోధ్యలోని రామ జన్మభూమి వద్దకు తీసుకెళ్తున్నారు.
అహోబిలం నుంచి పవిత్ర మట్టి జలాలు అయోధ్యకు
శ్రీరాముడు వనవాసం చేస్తున్న సమయంలో అహోబిలానికి వచ్చి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించినట్లు పురాణాలు చెబుతున్నాయని వేద పండితులు తెలిపారు.