ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 1, 2020, 3:56 PM IST

ETV Bharat / state

అయోధ్యకు అహోబిలం నుంచి పవిత్ర మట్టి, జలాలు

కర్నూలు జిల్లాలోని పవిత్ర వైష్ణవ పుణ్యక్షేత్రం అహోబిలం నుంచి పవిత్ర మట్టి, జలాలను అయోధ్యలోని రామ జన్మభూమి వద్దకు తీసుకెళ్తున్నారు.

kurnool district
అహోబిలం నుంచి పవిత్ర మట్టి జలాలు అయోధ్యకు

ఆగస్టు 5న అయోధ్యలో రామాలయ నిర్మాణ పనులు ప్రారంభించనున్నారు. ఆ ప్రారంభోత్సవానికి కర్నూలు జిల్లాలోని పవిత్ర వైష్ణవ పుణ్యక్షేత్రం అహోబిలం నుంచి పవిత్ర మట్టి, జలాలను తీసుకువెళ్లారు. అహోబిలం పీఠాధిపతి ఆదేశాల మేరకు పుట్ట బంగారు మంటపం వద్ద ఉన్న మట్టిని, సమీపంలోని భవనాశి నదిలోని పవిత్ర జలాలకు పూజ చేసి తీసుకువెళ్లారు.

శ్రీరాముడు వనవాసం చేస్తున్న సమయంలో అహోబిలానికి వచ్చి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించినట్లు పురాణాలు చెబుతున్నాయని వేద పండితులు తెలిపారు.

ఇదీ చదవండిఅమరావతికి మద్దతుగా కర్నూలులో తెదేపా నేతల నిరసన

ABOUT THE AUTHOR

...view details