ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 18, 2020, 11:46 AM IST

ETV Bharat / state

జాతీయ రహదారిపై కంది, శనగ రైతుల ఆందోళన

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో శనగ, కంది రైతులు జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. పంటను కొనుగోలు చేయటం లేదని నిరసన వ్యక్తం చేశారు.

farmers agitation in ammiganuru
జాతీయ రహదారిపై బైఠాయించిన ఎమ్మిగనూరు రైతులు

జాతీయ రహదారిపై బైఠాయించిన ఎమ్మిగనూరు రైతులు

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు రైతులు రోడ్డెక్కారు. మార్కెట్​కు తీసుకొచ్చిన శనగ, కంది పంటలను కొనుగోలు చేయటం లేదని, అధికారులు పట్టించుకోవటం లేదని ఆరోపించారు. మార్కెట్ యార్డు కార్యాలయం ఎదురుగా, జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచి ట్రాఫిక్ స్తంభించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని, రైతులకు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. అనంతరం మార్కెట్ కార్యాలయానికి చేరుకొని అధికారులను నిలదీశారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ రైతులు నినాదాలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details