ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 21, 2020, 8:24 AM IST

ETV Bharat / state

డోన్​లో కరోనా అనుమానిత వ్యక్తి కోసం పోలీసుల గాలింపు

బస్సులో ఓ వ్యక్తికి కరోనా లక్షణాలు ఉన్నట్లు డిపో మేనేజర్‌కు ప్రయాణికులు ఫిర్యాదు చేశారు. అనుమానిత వ్యక్తి కర్నూలు జిల్లా డోన్‌లో దిగిపోయినట్లు తెలిపారు. డిపో మేనేజర్‌ పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు కరోనా అనుమానిత వ్యక్తి కోసం గాలిస్తున్నారు.

corona-suspected
corona-suspected

కరోనా అనుమానిత వ్యక్తి కోసం గాలిస్తోన్న పోలీసులు

కర్నూలు జిల్లాలో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తికి కరోనా లక్షణాలు ఉన్నట్లు ప్రయాణికులు డిపో మేనేజర్‌కు ఫిర్యాదు చేశారు. ధర్మవరం నుంచి కర్నూలు వెళ్తున్న బస్సులో ప్రయాణిస్తున్న కరోనా అనుమానిత వ్యక్తి డోన్‌లో దిగిపోయినట్లు తెలిపారు. ఈ క్రమంలో బస్సును వెంటనే ఆపివేయాలని డిపో మేనేజర్‌ వెల్దుర్తి పోలీసులకు సమాచారమిచ్చారు. స్పందించిన పోలీసులు బస్సులోని ప్రయాణికులను వైద్య పరీక్షల కోసం కర్నూలు ఆసుపత్రికి తరలించారు. డోన్‌లో బస్సు దిగిపోయిన కరోనా అనుమానిత వ్యక్తి కోసం గాలిస్తున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details