ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 30, 2020, 11:53 AM IST

ETV Bharat / state

జిల్లాలో పెరుగుతున్న కేసులు.. మరో 43 మందికి పాజిటివ్!

రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ రోజు కొత్తగా మరో 71 కేసులు నమోదయ్యాయి. అందులో కర్నూలు జిల్లాలోనే అత్యధికంగా 43 కేసులు ఉన్నాయి.

corona cases
corona cases

కర్నూలు జిల్లాలో కరోనా మహామ్మారి విజృంభిస్తోంది. గత 24 గంటల్లో ఈ ఒక్క జిల్లాలోనే 43 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు జిల్లాలో 386 మంది కరోనా బారిన పడ్డారు. 43 మంది కోలుకోగా.. 9 మంది మృతి చెందారు.

రోజురోజుకూ పాజిటివ్ కేసులు పెరుగుతున్న కారణంగా... జిల్లా ప్రజలు భయపడుతున్నారు. అధికారులు కరోనా వ్యాప్తి చెందకుండా అనేక చర్యలు చేపడుతున్నా కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరగడంపై ఆందోళనకు గురవుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details