ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 10, 2020, 2:31 PM IST

ETV Bharat / state

నగర పాలక సంస్థ కార్యాలయంలో ఉద్యోగికి కరోనా..

కరోనా కారణంగా.. కర్నూలు నగర పాలక సంస్థ కార్యాలయం మళ్లీ మూతపడింది. కార్యాలయంలో ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు కార్యాలయాన్ని మూసివేశారు.

corona cases
corona cases

కర్నూలు నగర పాలక సంస్థ కార్యాలయంలో ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో అధికారులు కార్యాలయాన్ని మూసివేశారు. అనంతరం కార్యాలయాన్ని శానిటేషన్ చేస్తున్నారు. దీంతో వివిధ పనుల నిమిత్తం నగర పాలక సంస్థ కార్యాలయానికి వచ్చిన ప్రజలు వెనెక్కివెళ్తున్నారు. కేవలం నీటి, ఆస్థి పన్నుల కేంద్రాలను మాత్రమే తెరిచి.. భౌతిక దూరం పాటించే విధంగా ఏర్పాటు చేసి పన్నులు కట్టించుకుంటున్నారు. కరోనా కారణంగా కర్నూలు నగర పాలక సంస్థ కార్యాలయం మూత పడడం ఇది రెండోసారి.

ABOUT THE AUTHOR

...view details