మల్లికార్జునస్వామి సన్నిధిలో 'బుట్టా'
కర్నూలు ఎంపీ బుట్టా రేణుక శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జునస్వామిని దర్శించుకున్నారు.
శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జునస్వామిని దర్శించుకున్న కర్నూలు ఎంపీ బుట్టా రేణుక
శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జునస్వామిని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక దర్శించుకున్నారు. తానుఏ స్థానం నుంచి పోటీచేయాలనే విషయంపై స్పష్టత రాలేదని, కర్నూలు పార్లమెంటరీ సమీక్షలో ఎంపీ స్థానంపై చర్చ జరగలేదని అన్నారు.సీఎం నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నానని చెప్పారు.కోట్ల కుటుంబం తెదేపాలోకి రావడంపై ముఖ్యమంత్రి నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని తెలిపారు.తనకు ఏ పదవి ఇచ్చినా న్యాయం చేస్తాననిబుట్టా రేణుక స్పష్టం చేశారు.