ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కర్నూలు కలెక్టరేట్ ఎదుట భవన కార్మికుల ఆందోళన

కర్నూల్​ కలెక్టరేట్ ఎదుట భవన నిర్మాణ కార్మికులు ఆందోళన చేశారు. ఇసుక అందుబాటులో లేకపోవటంతో తమకు ఉపాధి దొరకడం లేదని చెప్పారు.

By

Published : Jul 8, 2019, 8:10 PM IST

కర్నూలు కలెక్టరేట్ ఎదుట భవన కార్మికుల ఆందోళన

కర్నూలు కలెక్టరేట్ ఎదుట భవన కార్మికుల ఆందోళన

రాష్ట్రంలో ఇసుక సమస్యను తక్షణమే పరిష్కరించి భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కల్పించాలని కర్నూలులో సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. భవన నిర్మాణ సామగ్రితో పెద్ద సంఖ్యలో కార్మికులు నిరసన చేపట్టారు. కొంత కాలంగా ఇసుక దొరకని కారణంగా... తాము ఉపాధి కోల్పోయామని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఇసుకను అందుబాటులోకి తీసుకురావాలని వారు కోరారు. ఈ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని వారికి ఆర్డీవో హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details