కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు శ్రీ వైష్ణవి డిగ్రీ కళాశాలలో గణేష్ మట్టి విగ్రహాలపై ఈటీవీ,ఈనాడు ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సీఐ శ్రీధర్,మట్టి వినాయకులను పూజించి ప్రకృతిని కాపాడుదామని అన్నారు.ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను కుంటలు,కాల్వల్లో నిమజ్జనం చేయడం వల్ల తాగునీరు కలుషితమై క్యాన్సర్ వంటి భయంకరమైన జబ్బులు వస్తాయని తెలిపారు.విద్యార్దులే మట్టి వినాయక ప్రయోజనాలను సమాజానికి అర్దమైయ్యే విధంగా చెప్పగలరని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈటీవీ, ఈనాడు ఆధ్వర్యంలో మట్టి విగ్రహాలపై అవగాహన
ఈటీవీ, ఈనాడు ఆధ్వర్యంలో కర్నూలు,ఎమ్మిగనూరులో మట్టి విగ్రహాలపై అవగాహన సదస్సు జరిగింది.
awerenes program about natural ganesh held by etv and eenadu media at emmiganuru in karnool district