ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అన్నె జ్యోతి.. అవాంతరాలు అధిగమించి.. అత్తారింట్లో అడుగుపెట్టింది!

కరోనా వైరస్​ విజృంభించిన వూహన్ నగరంలో చిక్కుకుని... కర్నూలుకు చెందిన అన్నె జ్యోతి ఎన్నో కష్టాలు పడింది. స్వదేశానికి వచ్చే సమయంలోనూ విమానం ఎక్కే ఆఖరి నిమిషంలో శరీర ఉష్ణోగ్రత పెరిగిన కారణంగా.. అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. చివరికి వైరస్ సోకకుండానే క్షేమంగా దిల్లీ చేరుకొంది. అప్పుడు వాయిదా పడిన జ్యోతి వివాహం ఇవాళ జరిగింది.

By

Published : May 24, 2020, 1:05 PM IST

annem jyothi marriage held at thammadaplle
అన్నెం జ్యోతికి వివాహం

ఎట్టకేలకు అన్నె జ్యోతికి వివాహం జరిగింది. కర్నూలు జిల్లా మహానంది మండలం తమ్మడపల్లెలో అమరనాథ్​తో... పరిమిత సంఖ్యలో కుటుంబ సభ్యుల మధ్య వీరిద్దరి కల్యాణం జరిగంది. మార్చి నెలలో జరగాల్సి వివాహం వాయిదా పడగా.. ఇవాల్టికి ముహూర్తం కుదిరి శుభకార్యం పూర్తయింది.

అసలెవరు ఈ అన్నె జ్యోతి?

చైనాలో వూహాన్ నగరంలో కరోనా విలయతాండవం చేస్తున్న రోజుల్లో... కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు మండలం ఈర్నపాడు గ్రామానికి చెందిన అన్నె జ్యోతి చిక్కుకుంది. టీసీఎల్​సెల్ కంపెనీలో ఉద్యోగం రాగా శిక్షణ కోసం వెళ్లిన 58 మందిలో జ్యోతి ఒకరు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న సమయంలో శిక్షణ కోసం వెళ్లిన వారందర్నీ స్వదేశాలకు పంపించేందుకు కంపెనీ ప్రతినిధులు ఏర్పాట్లు చేశారు.

  • స్వదేశానికి వచ్చే నిమిషంలో శరీర ఉష్ణోగ్రత పెరగటంతో అధికారులు అక్కడే ఉంచేశారు. దీంతో మార్చి 14 జరగాల్సిన పెళ్లి వాయిదా పడింది.
  • జ్యోతి అమ్మ.. తన కుమార్తెకు ఎటువంటి వైరస్ సోకలేదనీ, ఆమెను స్వస్థలానికి రప్పించాలని కలెక్టర్​కు వినతిపత్రం అందజేశారు.
  • కేంద్ర అధికారులు చొరవ చూపిన కారణంగా.. చైనా నుంచి జ్యోతి, మార్చి 1న దిల్లీకి చేరుకుంది. అక్కడే 14 రోజులు క్వారంటైన్​లో ఉంది.
  • అనంతరం దిల్లీ నుంచి క్షేమంగా ఇంటికి చేరింది. నేడు (మే 24) తమ్మడపల్లెకు చెందిన అమర్​నాథ్​ను పెళ్లి చేసుకొని, నవ వధువుగా అత్తారింట్లో అడుగుపెట్టింది.

సంబంధిత కథనం:

కర్నూలు జిల్లా యువతి పెళ్లికి... కరోనా గండం..!

ABOUT THE AUTHOR

...view details